పదేళ్లు టికెట్ కొన్నాడు.. జాక్పాట్ వరించిందిప్పుడు!
దుబాయిలో షాప్కీపర్గా పనిచేసే ఓ ప్రవాస భారతీయుడిని జాక్పాట్ వరించింది. దాదాపు పది సంవత్సరాల నుంచి అతడు ఇన్ఫినిటి మెగా రాఫిల్ లాటరీ టికెట్లు కొంటుండగా.. అదృష్టం ఇప్పుడు తలుపు తట్టింది.
అబుదాబి: దుబాయిలో షాప్కీపర్గా పనిచేసే ఓ ప్రవాస భారతీయుడిని జాక్పాట్ వరించింది. దాదాపు పది సంవత్సరాల నుంచి అతడు ఇన్ఫినిటి మెగా రాఫిల్ లాటరీ టికెట్లు కొంటుండగా.. అదృష్టం ఇప్పుడు తలుపు తట్టింది. దుబాయి షాపింగ్ ఫెస్టివల్ 25వ ఎడిషన్లో ఆ లాటరీని గెలుచుకున్నాడు. ఇందులో భాగంగా అతడు ఒక లగ్జరీ కారు, 2లక్షల దిర్హమ్ (రూ.13లక్షల నగదు)బహుమతి సాధించినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.
లాటరీ విజేత శ్రీజిత్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. ఏదో ఒక రోజు అదృష్టం నన్ను వరిస్తుందనే భావనతో దాదాపు పదేళ్లుగా రాఫిల్ లాటరీ కొంటున్నాను. ఈ గెలుపు ద్వారా నా కలలు నెరవేరనున్నాయి. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నగదు వారి భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది’ అని వివరించారు. దుబాయి షాపింగ్ ఫెస్టివల్లో ఇన్ఫినిటి సంస్థ అక్కడికి వచ్చే సందర్శకులకు క్యూఎక్స్50 కారు, 2లక్షల దిర్హమ్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లాటరీలో పాల్గొనాలనుకునే వారు దాదాపు 200 దిరహమ్లు పెట్టి లాటరీ కొనాలి. అదేవిధంగా ప్రతిసారి దుబాయి షాపింగ్ ఫెస్టివల్లో లక్కీ షాపర్ బహుమతి కూడా ఇస్తారు. ఈ బహుమతి పొందే వ్యక్తికి ఫెస్టివల్ చివరి రోజున 1మిలియన్ దిరహమ్(దాదాపు రూ.2కోట్లు) నగదు ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM