కర్తవ్య నిర్వహణ... మానవతా ధర్మం..
అనాధశవంగా మిగిలిపోవాల్సిన అత్యాచార బాధితురాలికి పోలీసులే అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
అత్యాచార బాధితురాలికి అంతిమ సంస్కారాల నిర్వహణ
ఆగ్రా: అనాధశవంగా మిగిలిపోవాల్సిన అత్యాచార బాధితురాలికి పోలీసులే అంతిమ సంస్కారాలను నిర్వహించారు. మనసున్న అందరినీ కదిలించే ఈ సంఘటన ఈ శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. ‘‘కొద్ది రోజుల క్రితం ఒక అత్యాచార బాధితురాలు ఆగ్రాలోని ఒక ఆసుపత్రిలో మరణించింది. పోస్ట్మార్టం జరిగిన అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లటానికి ఎవరూ రాలేదు. దానితో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించే బాధ్యతను మేమే తీసుకున్నాం. ఈ విధమైన చర్యలు పోలీసులు, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తాయని ఆశిస్తున్నాం.’’ అని నగర ఎస్పీ బోత్రే రోహన్ ప్రమోద్ వివరించారు. పోలీసులు మృతురాలికి హిందూ సంప్రదాయం ప్రకారం సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాకుండా వారు ఆమె పేరున అన్నదానం కూడా చేయటం విశేషం. కర్తవ్య నిర్వహణే కాకుండా మానవతా ధర్మాన్ని కూడా నిర్వహించిన ఆగ్రా పోలీసుల చర్య అందరి ప్రశంసలను అందుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం