chittoor: చిత్తూరు జిల్లాలో వరద బీభత్సం: కొట్టుకుపోయిన నలుగురు మహిళలు
భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతాకుతలం అవుతోంది. జిల్లాలోని బలిజపల్లి చెరువు వద్ద కాజ్వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు.
చిత్తూరు: భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతాకుతలం అవుతోంది. ఎటుచూసినా వరదలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బలిజపల్లి చెరువు వద్ద కాజ్వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మీదేవిగా గుర్తించారు. వీరు బంగారుపాళ్యం మండలం టేకుమండ వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారికోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
50 మంది రోగులు స్విమ్స్కు తరలింపు
మరోవైపు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యసేవలు ఆగిపోయాయి. ఆసుపత్రి విద్యుత్ మీటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. 50 మంది రోగులను అధికారులు స్విమ్స్కు తరలించారు. విద్యుత్ పునరుద్ధరించే వరకు రోగులు ఆసుపత్రికి రావద్దని సూపరింటెండెంట్ సూచించారు.
భారీ వరదలతో మాల్వాడి గుండం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సప్తగిరుల నుంచి వస్తున్న వరద నీటితో ఈ ప్రవాహం ఉద్ధృతమైంది. ఈ వరద ఉద్ధృతికి కపిలతీర్థం ఆలయంలో రెండు రాతి స్తంభాలు కూలాయి. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపంలో పైకప్పు, గోడ కూలాయి. మరోవైపు కడప-తిరుపతి జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో జాతీయ రహదారిపై వరద ప్రవాహం పెరిగింది. రహదారిపై కార్లు కూడా మునిగే స్థాయిలో వరద నీర చేరింది. బాలపల్లి, కుక్కలదొడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప-తిరుపతి మార్గంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..