త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చిలుక

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ చిలుక త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అందరినీ అబ్బురపరిచింది.

Published : 15 Aug 2020 15:50 IST

మైసూర్‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ చిలుక త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అందరినీ అబ్బురపరిచింది. మైసూర్‌లోని షెకావానాకు చెందిన గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహించిన స్వాత్రంత్ర్య వేడుకల్లో చిలుకతో జాతీయ జెండాను ఎగురవేయించారు. అది తన నోటితో తాడును లాగుతూ పతాకాన్ని ఆవిష్కరించింది. చివరిలో గణపతి సచ్చిదానంద స్వామి చెప్పినట్లు భారత్‌ మాతాకీ జై అంటూ చిలుక పలికింది. చిలుకలన్నీ ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని