Tamil Nadu: బూట్లు తడుస్తాయని.. భుజాలమీద కెక్కి..
ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం.
చెన్నై: ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా తన పదవితో వచ్చిన దర్పాన్ని ప్రదర్శించారు. నీళ్లలో తన కాళ్లు తడవకుండా ఉండేందుకు ఏకంగా మత్స్యకారుల భుజాలపైకెక్కి ఒడ్డుకు చేరారు. ఆయన్ను మత్స్యకారులు మోసుకొస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్గా మారింది.
తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్.. పాలవెర్కడులో కోతకు గురైన పముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పడవలో కొద్దిసేపు ప్రయాణించారు. పడవ ఒడ్డుకు చేరగానే అందులోంచి మంత్రి కిందకు దిగేందుకు వీలుగా ఓ మత్స్యకారుడు కుర్చీని ఏర్పాటు చేశాడు. కానీ తన బూట్లు తడుస్తాయంటూ నీటిలోకి దిగేందుకు ఆయన నిరాకరించారు. చివరికి మత్స్యకారుల భుజాలెక్కి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?