TS News:  ఐకేపీ కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి

ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తను పండించిన పంటను అమ్మేందుకు ఐకేపీ కేంద్రానికి వచ్చిన రైతు గుండెపోటుకు గురై మృతిచెందాడు. 

Updated : 25 Nov 2021 23:51 IST

కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తను పండించిన పంటను అమ్మేందుకు ఐకేపీ కేంద్రానికి వచ్చిన రైతు గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివనగర్‌ మండలం అడ్లూరుఎల్లారెడ్డిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు రాజయ్య(48) గుండెపోటుకు గురయ్యడు. వెంటనే గమనించిన స్థానికులు రాజయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే  మృతి చెందాడు. మృతుడు మూడు రోజులుగా ఐకేపీ కేంద్రంలోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని