బాల్యంలో అధిక చక్కెర తినడం ముప్పే!
బాల్యంలో అధిక మోతాదులో చక్కెర, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక మార్పులే కాదు, జీవక్రియల్లో కీలకంగా వ్యవహరించే సూక్ష్మజీవుల పనితీరులో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ బయాలజీలో ప్రచురించారు.
ఇంటర్నెట్ డెస్క్: బాల్యంలో అధిక మోతాదులో చక్కెర, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక మార్పులే కాదు, జీవక్రియల్లో కీలకంగా వ్యవహరించే సూక్ష్మజీవుల పనితీరులో, వాటి సంఖ్యలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ బయాలజీలో ప్రచురించారు.
మానవ శరీరంలో బ్యాక్టీరియా, ఫంగి, వైరస్ ఇలా అనేక రకాల సూక్ష్మజీవులు జీవిస్తుంటాయి. వీటిలో కొన్ని మానవునికి హాని చేస్తే.. మరికొన్ని జీవక్రియలో, రోగనిరరోదక శక్తిని పెంచడంలో, కొన్ని విటమిన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పేగుల్లో అనేక రకాల సూక్ష్మజీవులు ఆవాసం ఉంటూ జీర్ణక్రియలో తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. ఇలాంటి మంచి సూక్ష్మజీవుల పనితీరు సరిగా ఉన్నప్పుడే శరీరంలో ఎలాంటి అసమానతలు తలెత్తవు. దీంతో ఆరోగ్యంగా ఉండగలరు. అయితే, మానవులు చిన్న వయసులో ఎక్కువగా చక్కెర, కొవ్వు పదార్థాలు తింటే వయసు పెరిగే కొద్ది.. సూక్ష్మజీవుల పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయని ఆ తర్వాత రోగాల బారిన పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్దయ్యాక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా లాభం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ పరిశోధన కోసం కొన్ని ఎలుకల్ని నాలుగు గ్రూపులుగా విభజించి మూడు వారాలపాటు వాటికి వివిధ రకాల ఆహారం అందజేశారు. వాటిలో ఒక గ్రూపుకు చెందిన ఎలుకల్లో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే పాశ్చత్యదేశాల ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత తిరిగి ఆరోగ్యకరమైన ఆహారం అందజేశారు. అయితే, 14 వారాలు దాటిన తర్వాత మిగతా ఎలుకలతో పోలిస్తే.. చక్కెర, కొవ్వు పదార్థాలు తిన్న ఎలుకల్లో సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడం, వాటి పనితీరు మందగించడం గుర్తించారు. ముఖ్యంగా జీవక్రియలో కీలకంగా వ్యవహరించే బ్యాక్టీరియాల సంఖ్య తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని బట్టి.. బాల్యంలో తినే అధిక చక్కెర, కొవ్వు పదార్థాలు జీవితంలో దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయని తేలింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!