విద్యుత్‌ అధికారులను కట్టేసిన గ్రామస్థులు

విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ విద్యుత్తు బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన అధికారులను..

Updated : 18 Jul 2020 20:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదంటూ విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన అధికారులను గ్రామస్థులు స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కరెంటు సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, దీంతో కరెంటు బిల్లుల వసూలుకు వచ్చిన వారిని తాళ్లతో స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చేవరకు వారిని వదిలే ప్రసక్తే లేదని గ్రామస్థులు పట్టుబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని