రైతుల ఆదాయం రెట్టింపు కోసమే..సాగు చట్టాలు!
తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటన
బెంగళూరు: తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుతుందని మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలోని కేరకల్మట్టి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యవసాయ రంగానికి బడ్జెట్ పెంచడంతో పాటు వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచామని అమిత్ షా వెల్లడించారు. అంతేకాకుండా రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను ఆయన ఉదహరించారు. ముఖ్యంగా రైతులకు ప్రయోజనకరమైన ఆర్థిక సాయం(కిసాన్ సమ్మాన్ యోజన), ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ..తదితర పథకాలను వివరించారు.
ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో రైతులు నిరసన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని రైతులు చెబుతుంటే.. వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని మరోవైపు కేంద్రం కూడా స్పష్టంచేస్తోంది. అయితే, రైతులకున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రైతుల్లో చర్చలు జరిపింది. అయినప్పటికీ ఫలితం తేలలేదు. దీంతో మరోసారి చర్చలను కొనసాగించాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు..రైతుల సమస్యలను వినేందుకు ఓ కమిటీని వేసింది. అయితే, కమిటీ ముందుకు రావడానికి మాత్రం రైతు సంఘాల నేతలు నిరాకరిస్తున్నారు.
ఇవీ చదవండి..
సాగు చట్టాలపై సుప్రీం స్టే
ఆ ముగ్గుర్నీ తొలగించండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు