శునకం అనుకరణ.. యజమానికి ₹26వేల బిల్లు!
శునకాలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. నిజమే.. మనుషుల భావాలను, మాటలను శునకాలు చక్కగా అర్థం చేసుకుంటాయి. యజమాని సంతోషంలో ఉంటే.. శునకాలు మరింత హుషారుగా ఉంటాయి.. బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయక
(ఫొటో: రస్సెల్ జోన్స్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: శునకాలు మనిషికి మంచి స్నేహితులు అని చెబుతుంటారు. నిజమే.. మనుషుల భావాలను, మాటలను శునకాలు చక్కగా అర్థం చేసుకుంటాయి. యజమాని సంతోషంలో ఉంటే.. శునకాలు మరింత హుషారుగా ఉంటాయి.. బాధపడితే అవి కూడా బాధపడుతూనే అమాయక ప్రవర్తనలతో ఓదారుస్తుంటాయి. అలాగే ఓ శునకం తన యజమాని కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే.. సానుభూతి చూపే క్రమంలో ఆయన్ను అనుకరించే ప్రయత్నం చేసింది. దీంతో యజమానికి రూ. 26వేల ఖర్చు అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
లండన్లో నివసించే రస్సెల్ జోన్స్కు ఇటీవల కాలికి గాయమైంది. చికిత్సలో భాగంగా వైద్యులు ఆయన కాలుకు కట్టుకట్టారు. దీంతో రస్సెల్ కర్రల సాయంతో కాస్త కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని నిమిత్తం రస్సెల్ బయటకు వెళ్తుంటే.. ఆయన పెంచుకుంటున్న శునకం ‘బిల్’ కూడా వెంట వెళ్లేది. అయితే, తన యజమాని కుంటుతుండటంతో బిల్ కూడా కుంటడం మొదలుపెట్టింది. రస్సెల్ మాత్రం శునకం కాలికి కూడా గాయమైందేమోనని కంగారు పడ్డారు. వెంటనే పశువైద్యుల వద్దకు తీసుకెళ్లి.. ఎక్స్రే, ఇతర పరీక్షలు చేయించాడు. కానీ, వైద్యుల నివేదికలో బిల్ కాలికి ఎలాంటి గాయాలు కాలేదని తేలింది. అప్పుడు అర్థమైంది.. తను కుంటుకుంటూ నడవంతో బిల్ తనని అనుకరించిందని. శునకం చూపించిన సానుభూతికి రస్సెల్ ముగ్ధుడైనా.. దానికి నిర్వహించిన వైద్య పరీక్షలకు 300యూరోలు(రూ.26,533)ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని రస్సెల్ తన ఫేస్బుక్లో పోస్టు చేస్తూ.. తనను అనుకరిస్తూ కుంటుతున్న శునకం వీడియో జతచేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారడమే కాదు.. యజమానిపై శునకం చూపించిన ప్రేమ, సానుభూతికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఇవీ చదవండి..
పిల్లితో గూఢచర్యం: విఫలయత్నం.. ₹కోట్లు ఖర్చు
శునకాలు కరోనా బాధితుల్ని పసిగట్టగలవా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!