TS News: మూసీ నదిలో కొట్టుకువచ్చిన మృతదేహం

అంబర్‌పేట వద్ద మూసీనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. వర్షాలు,

Published : 28 Sep 2021 16:13 IST

హైదరాబాద్: అంబర్‌పేట వద్ద మూసీనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. వర్షాలు, వరదలతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు, సహాయక బృందాలు శవాన్ని బయటకు తీయలేకపోయాయి. మరోవైపు మూసీ ఉద్ధృతితో పరీవాహక ప్రాంతంలోని ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే మూసీకి భారీగా వరద పెరిగే సూచనలుండటంతో చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని