మృతులకు వివాహం.. కేరళలో వింత ఆచారం..!!
కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమవారికి వివాహం జరుపుతున్నారు......
ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమ వారికి వివాహం జరుపుతున్నారు. పెళ్లి చూపులు మొదలుకొని ఆహ్వాన పత్రికలు పంచడం వరకు సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. అసలు చనిపోయిన వారికి ఎలా పెళ్లి జరిపిస్తారు? ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుందాం..
కేరళ కాసర్గడ్ జిల్లా మారుమూల ప్రాంతమైన బడియడుక్కా గ్రామానికి చెందిన మగోర్ తెగ ప్రజలు చాలా కాలంగా చనిపోయివారికి వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లి కాకముందే మృతిచెందిన తమవారికి బొమ్మల రూపంలో ఈ వివాహం జరిపిస్తారు. తద్వారా మృతిచెందినవారి ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే మృతిచెందినవారికి వివాహం అంటే ఏదో సాదాసీదాగా బొమ్మలకు పెళ్లి చేసి ఊరుకుంటారని భావిస్తే పొరపాటే. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల పెళ్లికి ఏమేం చేస్తారో అన్నింటినీ ఈ పెళ్లిలో ఆ తెగ ప్రజలు పాటిస్తారు.
ముందుగా పెళ్లి కాకుండా చనిపోయిన తమ యువకుడి పెళ్లి కోసం వారి బంధువులు.. పెళ్లి కాకుండా మరణించిన యువతి ఇంటికి పెళ్లిచూపులకు వెళతారు. అక్కడ అన్నీ మాట్లాడుకొని వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆహ్వాన పత్రికల్ని ముద్రించి బంధువులకు అందజేస్తారు. పెళ్లి రోజునాడు మండపాన్ని అందంగా ముస్తాబుచేస్తారు. బొమ్మల రూపంలో ఆ యువ జంటను తయారుచేసి.. వారికి పెళ్లి చేసి ఒక్కటి చేస్తారు. అయితే సాధారణంగా ఈ కార్యక్రమాన్ని రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు. వివాహానికి వచ్చిన అతిథుల కోసం మంచి విందు ఏర్పాటుచేసి పెళ్లి జంటను దీవించండి అంటూ కోరతారు.
వివాహం తర్వాత వధూవరుల కుటుంబాలు ఎవరిదారి వారు చూసుకోకుండా ఇకపై కూడా వారు బంధువులుగానే కొనసాగుతారు. తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళుతూ తమ బంధుత్వాన్ని కొనసాగిస్తారు. వివాహం కాకుండా చనిపోయిన వారికి పెళ్లి చేయకుండా ఉంటే చెడు జరుగుతుందని మగోర్ తెగ ప్రజలు చెబుతున్నారు. అందుకే ఒకవేళ ఎవరైనా చిన్న వయసులోనే మృతిచెందితే వారి పెళ్లి వయసు వచ్చేవరకు ఆగి ఇలా చేస్తామని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!