ఈ బామ్మ స్టెప్పేస్తే.. నెట్టింట విజిల్సే
అభిరుచికి వయసు అడ్డుకాదు.. ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశాలతో పనిలేదు అని నిరూపించారు ఈ బామ్మ. ఆరు పదుల వయసులో అలవోకగా, ఒయ్యారంగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్ల
ఇంటర్నెట్డెస్క్: అభిరుచికి వయసు అడ్డుకాదు.. ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశాలతో పనిలేదు అని నిరూపించారు ఈ బామ్మ. ఆరు పదుల వయసులో అలవోకగా, ఒయ్యారంగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్ల మది దోచుకుంటున్నారు. ఆమే ముంబయికి చెందిన 62ఏళ్ల రవి బాలా శర్మ.
రవి బాలా.. ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్లో జన్మించారు. చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉన్న ఆమె.. కథక్, తబలా, సంగీతం నేర్చుకున్నారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 27ఏళ్ల పాటు మ్యూజిక్ టీచర్గా పనిచేశారు. అయితే డ్యాన్స్పై ఉన్న మక్కువతో రిటైర్మెంట్ తర్వాత మళ్లీ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఓ ఆన్లైన్ పోటీ కోసం తొలిసారిగా డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు పెద్దఎత్తున ప్రశంసలు రావడంతో మరిన్ని వీడియోలు పోస్ట్ చేశారు.
బాలీవుడ్ పాటలు, జానపద, భక్తి గీతాలతో పాటు భాంగ్రా పాటలకు కూడా ఎంతో చూడముచ్చటగా.. మంచి అభినయంతో ఆమె చేసే డ్యాన్స్లకు నెటిజన్లు మాత్రమే కాదు దిల్జిద్ దొసాంజె, ఇంతియాజ్ అలీ లాంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఆమె వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది కొద్దిరోజుల్లోనే ‘డ్యాన్సింగ్ దాదీ’గా నెట్టింట స్టార్ అయ్యారు. ఇప్పటికే ఆమె ఇన్స్టా ఖాతాను లక్షమందికి పైగా ఫాలో అవుతున్నారు.
ఇద్దరు పిల్లల తల్లి అయిన రవి బాలా ప్రస్తుతం తన కుమారుడితో కలిసి ముంబయిలో ఉంటున్నారు. అప్పుడప్పుడూ కొడుకుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. పాటల ఎంపిక, కాస్ట్యూమ్స్ విషయంతో పిల్లలే ఆమెకు సాయం చేస్తుంటారట. ‘‘వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. దాని కోసం మీ ఇష్టాలు, అభిరుచులను వదులుకోవద్దు. మీ జీవితంలో ఏ దశలోనైనా మీకు గుర్తింపు రావొచ్చు. ఇందుకు నేనే ఓ ఉదాహరణ’’ అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఈ డ్యాన్సింగ్ దాదీ బ్యూటిఫుల్ స్టెప్పులను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో