TS News: బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో 20 మంది సిబ్బందికి కరోనా

కొవిడ్‌ మహమ్మారి పోలీసులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడగా.. తాజాగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 20 మంది సిబ్బందికి

Published : 20 Jan 2022 21:04 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి పోలీసులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడగా.. తాజాగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఠాణాలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది అస్వస్థతకు గురవడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించారు. దీంతో ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 14మంది కానిస్టేబుళ్ల, ముగ్గురు హోం గార్డులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఠాణాలో విధులు నిర్వహిస్తున్న మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని