కూలీకి రూ.కోటి లాటరీ

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అకోటా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. లాటరీ రూపంలో అతడిని అదృష్టం వరించింది. బోదరాజు అనే కూలీ రూ.100 పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది....

Published : 18 Apr 2021 15:38 IST

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అకోటా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. లాటరీ రూపంలో అతడిని అదృష్టం వరించింది. బోదరాజు అనే కూలీ రూ.100 పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. ఏప్రిల్‌ 14న బోదరాజు రూ.100 పెట్టి లాటరీ టికెట్‌ కొన్నాడు. కాగా లూథియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో బోదరాజు కొన్న లాటరీని అదృష్టం వరించింది. ఈ విషయాన్ని లాటరీల నిర్వాహకుడు అశోక్‌.. బోదరాజుకు తెలియజేశాడు. త్వరలోనే నగదు అందిస్తామని వెల్లడించాడు. ఈ ఆనందాన్ని భార్య, ఇద్దరు కూతుళ్లతో పంచుకున్న బోదరాజు.. వచ్చే డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని