చైనా యూనివర్సిటీలో వర్చువల్ విద్యార్థిని!
చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని
(Photo: Tsinghua University Youtube Screenshot)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా విద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులంతా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. పాఠాలు, పరీక్షలు, సెమినార్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే ఉన్నా.. విద్యార్థులు మాత్రం ఇంటి నుంచి స్వయంగా పాల్గొనాల్సిందే. అయితే చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్ విద్యార్థిని. ఇటీవల ఆమె సింఘువా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో అడ్మిషన్ సంపాదించింది.
హువా హైబింగ్.. చైనాలో కృత్రిమ మేథ కలిగిన తొలి వర్చువల్ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. హువాను బీజింగ్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బీఏఏఐ), జైఫు ఏఐ, షియోఐస్ సంస్థలు కలిసి రూపొందించాయి. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునేలా శాస్త్రవేత్తలు ఆమెను తీర్చిదిద్దారు. ఇప్పటికే హువా పద్యాలు, చిత్రలేఖనం నేర్చుకుంటోందట. కోడింగ్లోనూ నైపుణ్యం సంపాదించడానికే ఆమెను ఈ కోర్సులో చేర్చినట్లు ఏఐ సంస్థలు వెల్లడించాయి. రోబోలాగా కాకుండా.. ఈ వర్చువల్ విద్యార్థిని మనిషిలాగే ఇతరులను పరిచయం చేసుకొని చక్కగా మాట్లాడగలదట. మనిషిలాగే ఆలోచిస్తూ.. భావోద్వేగాలనూ పలికించగలదని సింఘువా వర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ జీ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన బీఏఏఐ సమావేశంలో హువా తనకు తానుగా పరిచయం చేసుకొని తన వివరాలు వెల్లడించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..