3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా
సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పీఎమ్ఏవైయూ) పథకం కింద 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మంచనున్నట్లు వెల్లడి
దిల్లీ: సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పీఎమ్ఏవైయూ) పథకం కింద 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. దిల్లీలో మంగళవారం నిర్వహించిన కేంద్ర కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ(సీఎస్ఎమ్సీ) 54 వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణం కోసం వచ్చిన 708 ప్రతిపాదనలకు ఈ సందర్భంగా అంగీకారం తెలిపినట్టు కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గృహాలను బహుళ అంతస్తుల గృహ సముదాయాలుగా నిర్మించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ‘పీఎమ్ఏవైయూ అవార్స్డ్ 2021- 100 రోజుల ఛాలెంజ్’ను ప్రారంభించింది. పీఎమ్ఏవైయూ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్టు పేర్కొంది.
ఇప్పటివరకు పీఎమ్ఏవైయూ పథకం కింద 112.4 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపింది. నిర్మాణం ప్రారంభించిన 82.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే 48.31 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించినట్లు పేర్కొంది. ఈ పథకం మొత్తం పెట్టుబడి వ్యయం రూ.7.35 లక్షల కోట్లుగా వెల్లడించింది. అందులో కేంద్రం వాటా 1.81 లక్షల కోట్లు కాగా.. రూ.96,067 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టుల గురించి సమావేశంలో పాల్గొన్న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించింది. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ.. మిగులు నిధులను సద్వినియోగం చేసుకోవడం, తలపెట్టిన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంపైనే తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం