కోబ్రా ఎఫెక్ట్: బ్రిటీష్ వారికి షాకిచ్చిన దిల్లీవాసులు
కోబ్రా ఎఫెక్ట్.. ఆర్థిక రంగం, రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం చేసిన ఉపాయం వల్ల ఆ సమస్య మరింత జఠిలం కావడాన్నే ‘కోబ్రా ఎఫెక్ట్’అని అంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటనల
కోబ్రా ఎఫెక్ట్.. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం చేసిన ఉపాయం వల్ల ఆ సమస్య మరింత జఠిలం కావడాన్నే ‘కోబ్రా ఎఫెక్ట్’ అని అంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ ‘కోబ్రా ఎఫెక్ట్’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే..
దేశం బ్రిటీష్ పాలకుల చేతిలో ఉన్నప్పుడు దిల్లీ నగరంలో విషపూరిత పాములు సంచరించేవట. దీంతో ప్రజలు, అధికారులు భయాందోళనకు గురయ్యేవారు. వీటి బెడద తప్పించేందుకు బ్రిటిష్ అధికారుల్లో ఒకరు ఓ ఉపాయం ఆలోచించారు. దిల్లీ వ్యాప్తంగా పాముల బౌంటీ కార్యక్రమం ప్రారంభించారు. ఎవరైతే పామును చంపి దాని చర్మాన్ని తీసుకొస్తారో వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు పాములను చంపి, వాటి చర్మాన్ని అధికారులకు అప్పగించి, సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. అలా వందల సంఖ్యలో పాముల చర్మాలతో ప్రభుత్వ కార్యాలయాలు నిండిపోయేవి. ప్రజలకు బౌంటీ కింద నగదు బహుమతి ఇస్తుండటంతో ఖజానాలో డబ్బులు కూడా తగ్గిపోతుండేవి. ఇంత చేసినా నగరంలో పాముల సంఖ్య రోజురోజుకు పెరగడమే గానీ తగ్గుదల కనిపించలేదు.
అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని బ్రిటిష్ అధికారులు దర్యాప్తు చేయగా.. వారికి దిమ్మతిరిగే విషయం బయటపడింది. నగరంలో కొందరు పాములను పెంచి పోషిస్తున్నారని తెలిసింది. వాటినే నగరంలోకి వదిలి, పట్టుకొని బౌంటీ డబ్బులు తీసుకుంటున్నారని అర్థమైంది. ఈ విషయం తెలిసి షాక్కు గురైన అధికారులు వెంటనే బౌంటీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పాముల్ని చంపి, చర్మం తెచ్చినా డబ్బులు ఇచ్చేది లేదని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో పాములను ప్రజలు అడవుల్లో వదిలేశారు. అలా బ్రిటిష్ ప్రభుత్వం ఉపాయం బెడిసికొట్టి సమస్యను మరింత పెంచింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఒక సమస్యను పరిష్కరించబోయి మరింత జఠిలం చేసుకునే సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతుంటారు.
వియత్నాంలోనూ ఇలాగే..
వియత్నాంను ఫ్రాన్స్ పాలిస్తున్న కాలంలో కోబ్రా ఎఫెక్ట్లాంటి ఘటనే జరిగింది. 1902లో వియత్నాంలోని హనొయ్ నగరంలో ఎలుకలు విపరీతంగా ఉండేవి. దీంతో ఎలుకల్ని చంపి వాటి తోకని తీసుకొస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రజలు ఎలుకల్ని చంపకుండా కేవలం వాటి తోక కత్తిరించి వదిలిపెట్టేవారు. ఆ తోకను చూపించి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకునేవారు. కొంత కాలానికి నగరంలో తోకలు లేని ఎలుకలు కనిపించడంతో ప్రభుత్వం ఆరా తీసింది. ఎలుకల్ని చంపితే వాటి సంఖ్య తగ్గిపోతుందని ప్రజలే అలా తోక కత్తిరించి వదిలేస్తున్నారని తెలిసింది. ఈ ఎలుకలు సంతానోత్పత్తి చేస్తే మరిన్ని ఎలుకలు వస్తాయి.. వాటి తోకలు కూడా కత్తిరించి డబ్బులు సంపాదించాలని ప్రజలు భావించారట.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?