బాలుడికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.16 కోట్లు
బుడిబుడి నడకలతో అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన ఆ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పుట్టినప్పటినుంచే కండరాల వ్యాధితో తల్లడిల్లుతున్నాడు. ఆ మహమ్మారి నయం కావాలంటే అక్షరాలా రూ.16 కోట్లు కావాల్సిందేనని వైద్యులు....
సాయమందించాలని అర్థిస్తున్న తల్లిదండ్రులు
ఇంటర్నెట్ డెస్క్: ముద్దుమాటలతో అలరించాల్సిన ఓ బాలుడు అరుదైన ఆరోగ్యసమస్యతో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచే కండరాల సమస్యతో తల్లడిల్లుతున్నాడు. అది నయం కావాలంటే అక్షరాలా రూ.16 కోట్లు కావాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. ఇంపాక్ట్ గురూ.కామ్ ద్వారా కుటుంబసభ్యులు డబ్బుల కోసం అర్థిస్తున్నారు. చత్తీస్గఢ్కు చెందిన యోగేశ్ గుప్తా, రూపాల్ గుప్తా పదేళ్ల కిందట హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. లింగంపల్లిలోని నలగండ్లలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 2018లో అయాంక్ష్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచే బాలుడి ఆరోగ్యం సరిగా లేదు. దీంతో సికింద్రాబాద్లోని ఓ పిల్లల వైద్యశాలకు తీసుకెళ్లగా కుమారుడి వ్యాధి, అందుకయ్యే ఖర్చు తెలిసి తల్లిదండ్రులు కుంగిపోయారు. అయాంక్ష్ వెన్నెముఖ కండరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రపంచంలో దానికి ఏకైక చికిత్స జీన్ రిప్లేస్మెంట్ థెరపీ జోల్గన్ ఎస్ఎమ్ఏ ఔషధంతోనే సాధ్యమని పేర్కొన్నారు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు ఉంటుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంతపనైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
అంతమొత్తం డబ్బు ఏ ఒక్కరు సాయం చేయలేరని.. పెద్దఎత్తున క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ఖరీదైన చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ చేసే ఇంపాక్ట్ గురూ.కామ్లో యోగేశ్ గుప్తా ఫండ్ రైజింగ్ ప్రారంభించారు. కాగా, పది రోజుల్లో రూ.1.40 కోట్లు జమయ్యాయి. ఉద్యోగం చేస్తూనే.. సామాజిక మాధ్యమాలు, ఇతర సైట్ల సాయంతో నిధులు సమకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తమ కుమారుడి చికిత్స కోసం ప్రజలు ముందుకువచ్చి సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
తన కుమారుడికి ఈ వ్యాధి రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అయాంక్ష్ తల్లి రూపాల్ గుప్తా తెలిపారు. కుమారుడికి నిత్యం ఐదు గంటలపాటు ఫిజియోథెరఫీ చేయిస్తున్నామని, ఒక్కరోజు చేయించకున్నా ప్రమాదమని వాపోయారు. అయాంక్ష్ జన్మించినప్పటి నుంచి ద్రవరూప ఆహారమే తప్ప, ఘనరూపంలో ఆహారం తినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. రూ.16 కోట్ల భారీ మొత్తం త్వరగా సమకూరాలని అయాంక్ష్ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు మినహాయించి తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
ఇవీ చదవండి...
కేకుతో రామసేతు.. రామమందిరానికి విరాళం
నిన్ను, పిల్లల్ని చూడాలని ఉంది వస్తా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ