అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు
భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి అయిన పియూష్ అగర్వాల్ వీటిని తయారు చేస్తున్నారు. ఈయన ఇటీవలే ప్రభుత్వం నిధులు అందించే మాస్కుల
దిల్లీ : భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి అయిన పియూష్ అగర్వాల్ వీటిని తయారు చేస్తున్నారు. ఈయన ఇటీవలే ప్రభుత్వ చేయూతతో మాస్కుల తయారీ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ఇది ఐఐటీ దిల్లీతో అనుసంధానమై పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ సంఘం సెక్రటరీ జనరల్ రాజీవ్మెహతా బ్యాటరీ మాస్కుల గురించి మాట్లాడారు. ఒక్కో దాని ధర రూ.2,200 ఉంటుందని వివరించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అథ్లెట్లు సాధన చేయటానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందు కోసం ఈ మాస్కులను రూపొందిస్తున్నట్లు రాజీవ్ తెలిపారు. ఏ ఇతర మాస్కులు అందించనంత ఆక్సీజన్ను బ్యాటరీతో పనిచేసే మాస్కులు అథ్లెట్లకు అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ మాస్కులకు రెండు వైపులా ఎన్-95 వాల్వ్లు ఉంటాయి. కుడి వైపు వాల్వ్లో ఉన్న ఫ్యాను బయటి గాలిని తీసుకొని వడబోసి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎడమ వైపు ఉన్న మరొక వాల్వ్లోని ఫ్యాన్ వ్యక్తి వదిలిన గాలిని బయటికి పంపటానికి సాయపడుతుంది. మాస్కు బ్యాటరీలు చేతికి లేదా నడుముకు కట్టుకునే ఓ తీగకు అనుసంధానం అయి ఉంటాయి. బ్యాటరీని ఒక సారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. ఒలింపిక్ బరిలో ఉన్న అథ్లెట్లు తొలుత ఈ మాస్కులను వాడతారు. శ్వాస తీసుకోవడంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకపోతే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ బ్యాటరీ మాస్కుల ప్రాజెక్టు విజయవంతం అయితే భారత ఒలింపిక్ సంఘం మాస్కుల వాడకంపై ఇతర దేశాలకు సిఫార్సు చేస్తుందని రాజీవ్ తెలిపారు. వీటిని అథ్లెట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్