AP corona update: ఏపీలో కొత్తగా 220 కొవిడ్‌ కేసులు నమోదు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 220 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,532 శాంపిల్స్‌

Updated : 01 Nov 2021 18:02 IST

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 220 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,532 శాంపిల్స్‌ పరీక్షించగా.. 220 మందికి పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. 429 మంది కోలుకున్నట్టు తెలిపారు. అలాగే, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. 

ఏపీలో ఇప్పటివరకు 2,95,44,319 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 20,66,670 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20,48,151మంది కోలుకోగా.. 14,377మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4142 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని