Aadhar: బ్యాంకు ఖాతా స్టేటస్ తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఎల్పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్ అయ్యి ఉండాలి
ఇంటర్నెట్డెస్క్: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఎల్పీజీ సబ్సిడీ లాంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు తప్పని సరిగా లింక్ అయ్యి ఉండాలి. ఈ తరుణంలో కొందరు లబ్ధిదారులు నగదు తమ బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని వాపోతున్నారు. నగదు డిపాజిట్ కాకపోవడానికి ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం ఒక కారణం. అయితే బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూనిక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఒక లింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం ఏం చేయాలంటే..
* ముందుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్లో https://resident.uidai.gov.in/bank-mapper వెబ్సైట్కు లాగిన్ అవ్వాలి.
* ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న ‘సెండ్ ఓటీపీ’ మీద క్లిక్ చేయలి.
* ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపి వస్తుంది.
* ఓటీపీ నెంబర్ను నింపి ‘సబ్మిట్’ బటన్ నొక్కాలి. వెంటనే వివరాలు తెరమీద ప్రత్యక్షమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు