జత ఎడ్లు.. రూ.17లక్షలు

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ జత ఎడ్ల ధర అనూహ్యంగా రూ. 17లక్షలు పలికింది.  మహాలింగపుర్‌లోని నందగావ్‌లో సంగప్ప అనే వ్యవసాయదారు

Published : 12 Oct 2020 20:04 IST

రికార్డు ధరకు అమ్ముడైన వైనం

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఓ జత ఎడ్ల ధర అనూహ్యంగా రూ. 17లక్షలు పలికింది.  మహాలింగపుర్‌లోని నందగావ్‌లో సంగప్ప అనే వ్యవసాయదారు, అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గరి నుంచి 2018లో ఆ ఎడ్లను కొన్నాడు. అప్పుడు వాటి విలువ రూ.8 లక్షలు. ఆ తర్వాత వాటికి రామ్‌-లక్ష్మణ్‌ అనే పేరు పెట్టిన సంగప్ప ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. 48 పోటీల్లో పాల్గొన్న ఈ ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ. 9 లక్షలు సంపాదించి పెట్టాయట. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచేవి. ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ మల్లప్పకే వాటిని రూ.17 లక్షలకు విక్రయించాడు సంగప్ప.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని