హైదరాబాద్లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
కరోనా పరిస్థితులు, లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
25 శాతం మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: కరోనా పరిస్థితులు, లాక్డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు సుమారు ఆరునెలల తర్వాత రోడ్డెక్కనున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణాశాఖకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే 25 శాతం బస్సులను మాత్రమే నడిపేందుకు ఆయన అనుమతించారు. పరిస్థితిని బట్టి దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు.
నగరంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఈరోజు సీఎం కేసీఆర్తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు. ఈ క్రమంలో బస్సులు నడిపేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఏయే రూట్లలో బస్సులు నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత బస్సులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రకు కూడా రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు