హైదరాబాద్లో సిటీ బస్సులు రైట్.. రైట్
కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి.
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దశల వారీగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిదశలో కేవలం 25శాతం మాత్రమే సిటీ బస్సులు నడపనున్నారు. గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లో సుమారు 2,900 బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ రీజియన్ లో 1,700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్లో 1,200 బస్సులు గతంలో నడిచేవి. వీటిలో ప్రస్తుతం 25శాతం బస్సులను నడపాలని సీఎం ఆదేశించడంతో సుమారు 650 బస్సులు నడవనున్నాయి. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్ రాష్ట్ర బస్సులు నేటి నుంచి నడపనున్నట్లు రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు విధించిన లాక్డౌన్లో భాగంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపివేసిన విషయం తెలిసిందే. తదనంతరం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అన్లాక్లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి ఇవ్వడంతో ముందుగా జిల్లాలకు బస్సులను నడపడం ప్రారంభించారు. ఆ సమయంలో గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో సిటీ బస్సులు నడపడం అంత శ్రయేస్కరం కాదని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఈ నెల మొదట్లో మెట్రో రైలును సైతం ప్రారంభించారు. సిటీ బస్సులు నడిపేందుకు సీఎం కేసీఆర్ అనుమతించడంతో ఇవాళ నుంచి నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM