పెంపుడు శునకానికి సీమంతం

కర్ణాటకలోని విజయపురలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ శునకానికి..

Updated : 06 Sep 2020 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని విజయపురలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ శునకానికి వైభవంగా సీమంతం చేశారు. తమ పెంపుడు శునకంపై ప్రేమతో ఓ కుటుంబం చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలాపూర్‌ రోడ్డులో నివశించే సామాజిక కార్యకర్త ప్రకాశ్‌ కుంబర్‌ కుటుంబం సోనియా అనే పొమరేనియన్‌ జాతి కుక్కను పెంచుకుంటోంది. కాగా ఆ శునకం గర్భం దాల్చిన సందర్భంగా ఘనంగా వేడుక నిర్వహించారు. సోనియా సీమంతానికి వచ్చిన ఇరుగుపొరుగు వారు దానికి బొట్టు పెట్టి, హారతి పట్టారు. ఈ సందర్భంగా సోనియాకు ప్రకాశ్‌ బంగారు గొలుసు బహూకరించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని