INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
ఒంటికి రంగుపూసుకుని గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న చిన్నారి...
ఒంటికి రంగుపూసుకుని గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న చిన్నారి. హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద కన్పించిందీ దృశ్యం. తల్లిదండ్రులే చిన్నారులకు రంగుపూసి భిక్షాటనకు పంపిస్తున్నారు.
తెలంగాణ ఈసెట్ పరీక్ష రాసేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ విద్యార్థిని రెండు నిమిషాలు ఆలస్యం కారణంగా పరీక్షకు అనుమతించలేదు. దీంతో తనను పరీక్షకు అనుమతించాల్సిందిగా పరీక్షా కేంద్రం సిబ్బందిని బతిమాలుతున్న దృశ్యం.
సాధారణంగా మొక్కలను భూమిలో గుంత తీసి నాటుతారు. హైదరాబాద్ సమీపంలోని పెద్ద అంబర్పేట పురపాలకశాఖ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బండరాళ్లపై ఇనుప డ్రమ్ములు పెట్టి వాటిలో మట్టి, ఎరువు పోసి మొక్కలను నాటుతున్నారు. ఈ విధానంలో కేవలం రావి మొక్కలను నాటుతున్నారు. పెరిగేకొద్దీ మొక్కల వేళ్లు రాళ్ల మధ్యలోని చిన్న చిన్న సందుల్లోకి వెళ్లి బతుకుతాయి.
ఖమ్మంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈసెట్ పరీక్షా కేంద్రంలోని వెళ్లేందుకు ఎండలోనే బారులు తీరిన విధ్యార్థులు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. మద్యం దుకాణాల వద్ద తాగడాన్ని ప్రభుత్వం నిషేధించినా హైదరాబాద్ జీడిమెట్ల సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద భౌతికదూరం పాటించుకుండా మందుప్రియులు అక్కడే తాగుతున్నారు.
హైదరాబాద్ మల్కాజిగిరి ప్రధాన రహదారిలో హైటెన్షన్ విద్యుత్ స్తంభంలో ఏర్పాటు చేసిన గణపతి చూపరులను ఆకట్టుకుంటున్నాడు.
తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి చెట్టుతో పాటు పోటీగా కరివేపాకు చెట్టు ఎదుగుతోంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు నవభారత్నగర్లోని ఓ ఇంట్లో పదేళ్ల క్రితం నాటిన కరివేపాకు మొక్క 24 అడుగుల ఎత్తు పెరిగింది. సాధారణంగా కరివేపాకు చెట్టు 15 అడుగులు మించి పెరగదు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల కారణంగా అరుదుగా ఇంత పొడవు పెరిగిందని వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు పాలపర్తి షారా తెలిపారు.
హైదరాబాద్ హుస్సేన్సాగర్లో గణేశుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ