INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
హైదరాబాద్లోని నాగోల్-రాయదుర్గం మధ్య మెట్రో రైలు సేవలు మంగళవారం పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా ప్రయాణికులు మెట్రో ఎక్కేందుకు ఆసక్తి చూపలేదు. అమీర్పేట నుంచి నాగోల్ వెళ్తున్న రైలులో ప్రయాణికులు లేక బోసిపోతున్న బోగీలో సెల్ఫీ దిగుతున్న యువకుడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మోరంపూడి కూడలిలో పైవంతెన నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ మార్గాని భరత్, కేంద్ర బృందంతో విచ్చేశారు. త్వరితగతిన వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతులు అందజేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ శంషాబాద్లోని విమానాశ్రయంలో మంగళవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు. మొక్కను నాటిన అనంతరం సెల్పీదిగుతున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.
ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర లేదా బోడ కాకర అని పిలుస్తారు. ఇవి శరీరంలోని చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కిలో రూ.150 ధరతో కొనుగోలు చేస్తున్న ప్రజలు.
భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి కుంటల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ సరిగా లేక దుర్గంధం వ్యాపిస్తోంది. చందానగర్లో ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్ వినాయక విగ్రహాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన దృశ్యం.
కర్నూలు మార్కెట్కు మంగళవారం ఉల్లి రైతులు పోటెత్తారు. కొవిడ్ కారణంగా రైతులకు టోకెన్లు ఇచ్చి విడతలవారీగా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు ఒకరోజు ముందుగానే మార్కెట్కు రావడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. తెచ్చిన ఉల్లితో రైతులు రెండు రోజులు మార్కెట్లో ఉండాల్సి వస్తుంది. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో రైతులు తాము తెచ్చిన ఉల్లి బస్తాలపైనే సేదతీరుతున్నారు.
ఓ గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ భరత్నగర్లో రైల్వే ట్రాక్ దాటుతూ మంగళవారం మృతిచెందాడు. ట్రాక్ దాటుతుండగా పట్టాల మధ్య కాలు ఇరుక్కుపోయి చనిపోయి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కొవిడ్ కారణంగా మృతదేహాన్ని పట్టాలపై నుంచి తొలగించేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టింది. అప్పటి వరకు మృతదేహం పట్టాలపైనే ఉంది. దీంతో భరత్నగర్ పైవంతెన మీదుగా వెళ్లే ప్రజలు మృతదేహాన్ని చూసేందుకు ఆగడంతో వంతెనపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెనపై వాహనాలు ఆపినవారికి జరిమానా విధిస్తామని పోలీసులు ప్రకటించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్వల్ప లాఠీఛార్జీ చేయాల్పి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!