INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
ఈ చిత్రాన్ని చూస్తుంటే సినిమా షూటింగ్లా అనిపిస్తోంది కదూ! అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. వారంతా ఆక్టోపస్ పోలీసులు. హైదరాబాద్ నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను అత్యాధునిక కెమెరాలతో 360 డిగ్రీల కోణంలో చిత్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు జరిగితే వేగంగా, సులువుగా ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద తీసిన చిత్రమిది.
గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. గుంటూరు మహిళా ప్రాంగణంలో ఆర్డీవో భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు అభ్యర్థులను ప్రశ్నలు అడిగారు. కొవిడ్ నిబంధనలు మేరకు అభ్యర్థులు, కమిటీ సభ్యులు మధ్య ప్లాస్టిక్
తెరను ఏర్పాటు చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అభ్యర్థులు తెర చాటు నుంచే సమాధానాలు చెప్పారు.
వృద్ధాప్య పింఛను తీసుకునే ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ అందుకోవాలంటే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. దీంతో తమకు పింఛన్ రాదనే భయంతో కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్షా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులను చిత్రంలో చూడొచ్చు.
ఆస్ట్రియాకు చెందిన ఐస్ స్విమ్మర్ జోసెఫ్ కోబ్లెర్ మంచు గడ్డల మధ్య ఎక్కువ సమయం ఉన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. శనివారం ఆస్ట్రియాలోని మెల్క్ నగరంలో ఓ గాజు పెట్టెలో నిలబడి దాని నిండా ఐస్ ముక్కలు పోయించుకున్నాడు. రెండు గంటలపాటు పెట్టెలో నిల్చున్నాడు. గతంలో చైనా క్రీడాకారుడు నెలకొల్పిన గంటా 53 నిమిషాల రికార్డును జోసెప్ కోబ్లెర్ బద్దలుకొట్టాడు. పోటీలో గెలిచిన అనంతరం కోబ్లెర్ ఐస్క్రీమ్ తినడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!