In Pics: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
తిరుచానూరు రోడ్డులోని విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో వీధి వ్యాపారుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వీరిని కట్టడి చేసేందుకు...
తిరుపతి: తిరుచానూరు రోడ్డులోని విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో వీధి వ్యాపారుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వీరిని కట్టడి చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో నిరుపయోగంగా ఉన్న కార్లను రహదారి పక్కన వరుసగా నిలపడంతో అక్రమ వ్యాపారాలకు చెక్పడడంతోపాటు ట్రాఫిక్ సమస్య తీరింది.
హైదరాబాద్: ఖైరతాబాద్లో ధన్వంతరి నారాయణ గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన యువతులు మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా ఫొటోలు దిగుతున్న దృశ్యం.
తిరుపతి నుంచి తిరుమలకు రెండో ఘాట్లో నుంచి వెళ్తుండగా కనిపించే ఈ గోడ ఎత్తు 10 అడుగులు, పొడవు సుమారు 14 కిలోమీటర్లు. జంతుప్రదర్శనశాల నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉండే ఈ గోడను అడవిలోని జంతువులు, చెట్లను స్మగ్లర్ల బారి నుంచి కాపాడేందుకు నిర్మించారు. ఏడాది క్రితమే గోడ నిర్మాణం పూర్తయింది.
హైదరాబాద్: జొన్న చేనులో పాలగింజలను తింటున్న పక్షి.. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ సమీపంలో ‘ఈనాడు’ కెమెరా క్లిక్మనిపించింది.
గణపతి నవరాత్రుల్లో భక్తులు, సందర్శకులతో ఎంతో సందడిగా ఉండే హైదరాబాద్లోని ట్యాంక్బండ్ కరోనా కారణంగా బోసిపోయింది. కొనుగోలుదారులు లేక దిగాలుగా వెళ్తున్న బెలూన్లు అమ్ముకునే మహిళ.
తల వెంట్రుకలను పువ్వు ఆకారంలో కత్తిరించుకున్న యువకుడు హైదరాబాద్ నాంపల్లిలో కనిపించగా ‘ఈనాడు’ కెమెరా తీసిన చిత్రమిది.
హైదరాబాద్: కరోనా సోకినవారు ఆక్సిజన్ థెరపీ ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా బాధిత కుటుంబ సభ్యులకు కాన్సన్ట్రేటర్లు అందజేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఓ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా అందజేస్తుంది. చికిత్స అనంతరం వీటిని స్వచ్ఛంద సంస్థకు తిరిగి ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం