ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేశారు: లోకేశ్‌

అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 22 Oct 2020 16:07 IST

అమరావతి: అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దేశం గర్వపడే స్థాయిలో నూతన రాజధానిని కట్టుకుంటున్నారని ప్రధాని సహా పొరుగు రాష్ట్రాల సీఎంలు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి ఆంధ్రులను అభినందించారని ఈ సందర్భంగా లోకేశ్‌ గుర్తు చేశారు. అయితే, అప్పడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ మాత్రం ఇంట్లో కూర్చొని విధ్వంసకర ఆలోచనలు చేశారని ఆరోపించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని