డబుల్ డెక్కర్ బస్సులో ఫొటోషూట్..
బీచ్లు, ఇతర ప్రాంతాల్లోనే కాకుండా క్లాసిక్గా పాతకాలపు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోలు కొత్త అనుభవాన్ని పంచుతోంది. డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోషూట్లకు కేరళ ఆర్టీసీ అవకాశం కల్పిస్తోంది...
అవకాశం కల్పిస్తున్న కేరళ ఆర్టీసీ
ఇంటర్నెట్ డెస్క్: పుట్టినరోజు వేడుకలు.. వివాహాది శుభకార్యాలు.. ఫంక్షన్లు.. సందర్భం ఏదైనా ఫొటోషూట్లు ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెళ్లి కార్డులకు బదులు చిన్నపాటి వీడియోలనే శుభలేఖలుగా పంపించుకుంటున్నారు. దీనికోసం ఫొటోషూట్లు, వీడియోషూట్లు నిర్వహించుకుంటున్నారు. కానీ ఎప్పుడూ బీచ్లు, ఇతర ప్రాంతాల్లోనే కాకుండా క్లాసిక్గా పాతకాలపు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోలు కొత్త అనుభవాన్ని పంచుతోంది. డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోషూట్లకు కేరళ ఆర్టీసీ అవకాశం కల్పిస్తోంది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఈ బస్సులను అద్దెకిస్తోంది. రోడ్డుపై ప్రయాణిస్తూ కూడా అందులో ఫొటోషూట్ నిర్వహించుకోవచ్చు.
చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు కూడా ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో చేసుకోవచ్చు. లండన్లో కనిపించే సాయంత్రపు టీ బస్ తరహాలో ఈ బస్సులను డిజైన్ చేశారు. కింది భాగంలో సీట్లు ఉండి పైభాగంలో పార్టీలు చేసుకునేందుకు ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఫొటోషూట్లు, పుట్టినరోజు వేడుకలకు.. ఇలా దేనికోసమైనా తక్కువ ధరకే బస్సును అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకు కేరళ ఆర్టీసీ 8గంటలకు గాను 4వేల రూపాయలను వసూలు చేస్తుంది. అయితే ఈ బస్సులో తిరువనంతపురం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. డబుల్ డెక్కర్ బస్సులో నిర్వహించిన తొలి ఫొటోషూట్కు అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి