చిన్న కీటకమే.. కానీ భలే గట్టిది..!
కష్టాల్ని భరించిన వాడే విజయంలోని ఆనందాన్ని ఆస్వాదించగలడు. సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లినవాడే ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలడు. ఈ వ్యాఖ్యలకు ఉదాహరణ చూపిస్తూ.. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గొయెంకా స్ఫూర్తిదాయకమైన వీడియో షేర్ చేశారు. అందులో ఓ చిన్న....
స్ఫూర్తినింపే వీడియో షేర్ చేసిన హర్ష గొయెంకా
న్యూదిల్లీ: కష్టాల్ని భరించిన వాడే విజయంలోని ఆనందాన్ని ఆస్వాదించగలడు. సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లినవాడే ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలడు. ఈ వ్యాఖ్యలకు ఉదాహరణ చూపిస్తూ.. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గొయెంకా స్ఫూర్తిదాయకమైన వీడియో షేర్ చేశారు. అందులో ఓ చిన్న కీటకం చెక్కపై పాకుతూ ముందుకు వెళ్తుంటుంది. మధ్యలో గ్యాప్ ఉండటంతో దాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నిస్తుంది. కష్టమైనా సరే.. కాస్త సాహసం చేసి.. చివరికి అటువైపుకు చేరుకుంటుంది. అంత చిన్న కీటకానికి ఉన్న పట్టుదల నెటిజన్లలో స్ఫూర్తిని నింపుతోంది.
‘వదిలేయకండి.. ప్రయత్ని'స్తూనే ఉండండి, ఆగిపోకండి.. ముందుకు సాగండి, నిరాశ చెందొద్దు.. నమ్మకంతో ఉండండి. మన సమస్యకు ఓ మార్గం ఎప్పుడూ ఉంటుంది’ అని హర్ష గొయెంకా వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ‘అద్భుతం, మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు, లక్ష్యాన్ని సాధించేవరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి, అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందం ఎంతో గొప్పది..’ అంటూ కామెంట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!