దసరా స్పెషల్‌: మరో 18 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ - మైసూర్‌- కాచిగూడ; హైదరాబాద్‌ - జైపూర్‌ - హైదరాబాద్‌; .......

Published : 16 Oct 2020 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. నిన్న కొన్ని రైళ్లను ప్రకటించగా.. గురువారం తాజాగా మరో 18 ప్రత్యేక రైళ్లతో జాబితాను విడుదల చేసింది. కాచిగూడ - మైసూర్‌- కాచిగూడ; హైదరాబాద్‌ - జైపూర్‌ - హైదరాబాద్‌; హైదరాబాద్‌ - రక్సాల్‌- హైదరాబాద్; విశాఖ- నిజాముద్దీన్‌; విశాఖ -విజయవాడ; విశాఖ - కడప; విశాఖ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్ల మధ్య ఈ సర్వీసులను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 20 నుంచి నవంబరు 30 వరకు ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఆయా రైళ్ల ప్రయాణ వేళలు, అవి ఆగే స్టేషన్ల వివరాలను అధికారులు గురువారం ట్విటర్‌లో వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిచే అంశంపై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లకు ప్రాధాన్యం మరింతగా పెరిగింది. కాచిగూడ- మైసూరు రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయి. అలాగే, హైదరాబాద్‌- జైపూర్‌ రైలు వారంలో రెండు రోజుల పాటు మాత్రమే సేవలందించనుండగా.. హైదరాబాద్‌- రక్సాల్‌ రైళ్లు వారంలో ఒకరోజు మాత్రమే తిరగనున్నాయి. ఆయా రైళ్లలో సెకెండ్‌ సిట్టింగ్‌, స్లీపర్‌ క్లాస్‌తో పాటు థర్డ్‌, సెకెండ్‌, ఫస్ట్‌ ఏసీ బోగీలు ఉండనున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని