₹200 ఖర్చు.. లక్షాధికారి అయిన రైతు..!

కేవలం రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్న ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్‌ యాదవ్‌ నవంబర్‌లో రూ.200 పెట్టి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు...

Published : 08 Dec 2020 02:07 IST


ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌‌: కేవలం రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్న ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్‌ యాదవ్‌ నవంబర్‌లో రూ.200 పెట్టి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా శనివారం భూమిని కొంతవరకు తవ్వాడు. ఈ క్రమంలో అతడికి ఓ రాయి దొరికింది. 

గులకరాయిని పోలిన ఆ రాయి కొంచెం భిన్నంగా ఉండడంతో దాన్ని ఆ జిల్లా వజ్రాల అధికారికి చూపించాడు. దీంతో అది రాయి కాదు 14.98 క్యారెట్ల వజ్రం అని తేలింది. దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తేలడంతో ఆ రైతు ఆనందం హద్దులుదాటింది. వజ్రం ద్వారా వచ్చిన డబ్బులను తన పిల్లల భవిష్యత్‌కు వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. తాను పెద్దగా చదువుకోలేదని, పిల్లల చదువుకోసం ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని వివరించాడు. భూమిలో మరో వజ్రం దొరుకుతుందనే నమ్మకంతో ఇంకొన్ని నెలల పాటు అక్కడే పని కొనసాగించనున్నట్లు యాదవ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు