₹200 ఖర్చు.. లక్షాధికారి అయిన రైతు..!
కేవలం రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్న ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్ యాదవ్ నవంబర్లో రూ.200 పెట్టి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు...
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: కేవలం రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్న ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్ యాదవ్ నవంబర్లో రూ.200 పెట్టి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా శనివారం భూమిని కొంతవరకు తవ్వాడు. ఈ క్రమంలో అతడికి ఓ రాయి దొరికింది.
గులకరాయిని పోలిన ఆ రాయి కొంచెం భిన్నంగా ఉండడంతో దాన్ని ఆ జిల్లా వజ్రాల అధికారికి చూపించాడు. దీంతో అది రాయి కాదు 14.98 క్యారెట్ల వజ్రం అని తేలింది. దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తేలడంతో ఆ రైతు ఆనందం హద్దులుదాటింది. వజ్రం ద్వారా వచ్చిన డబ్బులను తన పిల్లల భవిష్యత్కు వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. తాను పెద్దగా చదువుకోలేదని, పిల్లల చదువుకోసం ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివరించాడు. భూమిలో మరో వజ్రం దొరుకుతుందనే నమ్మకంతో ఇంకొన్ని నెలల పాటు అక్కడే పని కొనసాగించనున్నట్లు యాదవ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!