కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం
జన సంచారంలేని ఓ ఎడారి ప్రాంతంలో స్టీలు స్తంభం పాతి ఉండటం.. కొద్దిరోజులకు అకస్మా్త్తుగా అది మాయమవ్వడం.. 24 గంటలు గడవకముందే అదే తరహా స్తంభం మరో దేశంలో దర్శనమివ్వడం ప్రస్తుతం ప్రపంచ పరిశోధకులను కలవరపెడుతోంది....
మాయమై 24 గంటలు గడవకముందే మరో దేశంలో ప్రత్యక్షం
బుచారెస్ట్: జన సంచారంలేని ఓ ఎడారి ప్రాంతంలో స్టీలు స్తంభం పాతి ఉండటం.. కొద్దిరోజులకు అకస్మాత్తుగా అది మాయమవ్వడం.. 24 గంటలు గడవకముందే అదే తరహా స్తంభం మరో దేశంలో దర్శనమివ్వడం ప్రస్తుతం ప్రపంచ పరిశోధకులను కలవరపెడుతోంది. అసలు ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో తెలుసుకునేందుకు వారు పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికాలోని యుటాలో ఉన్న రెడ్ రాక్ ఎడారిలో పాతి ఉన్న స్టీల్ మాదిరి ఏకశిలను అక్కడి ప్రజా భద్రత విభాగం అధికారులు నవంబర్ 18న గుర్తించారు. అయితే కొద్దిరోజుల తర్వాత అది అకస్మాత్తుగా మాయమైంది. ఎవరో దాన్ని తవ్వి తీసుకొని వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అలా జరిగి 24 గంటలు గడవకముందే యూరప్లోని రొమానియాలో ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో అదే తరహా ఏకశిల కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది.
రొమేనియాలోని ప్రాచీన కట్టడం పెట్రోడోవా డేసియన్ కోట నుంచి కొన్ని మీటర్ల దూరంలో త్రిభుజాకార లోహ స్తంభాన్ని కనుగొన్నారు. అది అమెరికాలోని యుటాలో కనుగొన్న ఏకశిలను పోలి ఉండటం గమనార్హం. ఆకారంలో దానికీ, దీనికీ చిన్నపాటి తేడాలు మాత్రమే ఉన్నాయి. యుటాలో కనుగొన్న ఆకారం స్టెయిల్లెస్ స్టీల్తో రూపొందించినట్లుగా ఉంటే రొమేనియాలో కనుగొన్న ఏకశిల ప్రతిబింబించే ఉపరితలాన్ని కలిగి ఉంది. దానిపై అర్థం కాని రాతలు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రసిద్ధ కట్టడాలు ఉన్న ఆ ప్రాంతంలో ఈ వింత ఆకారాన్ని గుర్తించిన కొందరు అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ ఆకారాన్ని పరిశీలిస్తున్నట్లుగా నీమ్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ అధికారి రోక్సానా జోసాను ఆంగ్ల వార్తా పత్రిక డైలీ మెయిల్కు తెలిపారు.
యుటాలోని రెడ్రాక్ ఎడారి ప్రాంతంలో గొర్రెలను లెక్కించేందుకు వన్యప్రాణి విభాగంవారు నవంబర్ 18న సర్వే నిర్వహిస్తూ ఎడారిలో పాతిఉన్న ఓ స్టీల్ స్తంభాన్ని కనుగొన్నారు. జనసంచారం లేని ఆ మారుమూల ప్రాంతంలో దాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అంతుచిక్కలేదు. అది గ్రహాంతరవాసుల పనేనని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రొమేనియాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో