మందుబాబులకు ఏపీ సర్కారు షాక్‌

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 27 Oct 2020 01:18 IST

అమరావతి: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా మద్యం తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మూడు మద్యం సీసాలు తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని.. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మద్యాన్ని కేంద్రం నిబంధనల మేరకు అనుమతిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని