Uttar Pradesh: 60 ఏళ్లుగా ఇసుకే ఆమె ఆహారం..!
ఆహారం తీసుకుంటున్నప్పుడు.. పంటిలో చిన్న రాయి పడితేనే విలవిల్లాడిపోతాం. కానీ ఆ వృద్ధురాలు మాత్రం ఇసుకను కరకరా నమిలి తినేస్తోంది.
వారణాసి: ఆహారం తీసుకుంటున్నప్పుడు.. పంటిలో చిన్న రాయి వస్తేనే విలవిల్లాడిపోతాం. కానీ ఆ వృద్ధురాలు మాత్రం ఇసుకను కరకరా నమిలి తినేస్తోంది. వాస్తవానికి 60ఏళ్ల నుంచి అదే ఆమె ఆహారం. అయినా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. 75 ఏళ్లు దాటినా ఎంతో చురుగ్గా పొలం పనులు చక్కబెట్టేస్తోంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ బామ్మ.
వారణాసి జిల్లాకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కుష్మావతిదేవికి ఇసుకే ఆహారం. షోలాపుర్ ప్రాంతంలోని కఠారి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆమె నివసిస్తోంది. 15 ఏళ్ల వయసులో కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో ఆమె తొలిసారి ఇసుక తినేసింది. అదే ఆమెకు చాలా సౌకర్యంగా అనిపించడంతో.. అప్పటినుంచి ఇసుకను ఆహారంగా తీసుకుంటోంది. 75 ఏళ్లు దాటినా కుష్మావతి దేవి ఇంటి పనులు, పొలం పనులను చకచకా చేసుకుంటోంది. ఎంతో చురుగ్గా ఉంటోంది. ఇసుక మాత్రమే తింటున్న తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని ఆమె తెలిపింది. తన ఆరోగ్య రహస్యం ఇసుక తినడమేనని ఆమె చెబుతోంది.
ఇసుక తినొద్దని కుష్మావతిదేవికి కుమారుడు, మనవలు, బంధువులు ఎంత చెప్పినా ఆమె వినడంలేదు. ఆమెతో ఈ అలవాటును మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాలని కుటుంబసభ్యులు భావించినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. పాలతో కలిపి ఇసుకను తీసుకోవాలని స్థానిక వైద్యుడు ఒకరు ఆమెకు సూచించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆమె ఇసుకను ఆహారంగా తీసుకోవడానికి మానసిక సమస్య కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. శరీరంలో జింక్, ఐరన్ లోపం ఉన్నవారు.. ఇలా ఇసుకను ఆహారంగా తీసుకుంటారని చెబుతున్నారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్