Skyscrapers: ప్రపంచంలో నేలమట్టమైన ఆకాశహర్మ్యాలు ఇవే..!
ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన నోయిడా జంట టవర్లు (Noida Twin Towers) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు నేలమట్టమయ్యాయి. వంద మీటర్ల ఎత్తయిన భవంతులను కూల్చివేసే ఘటనను యావత్ దేశం ఆసక్తిగా గమనించింది. ఇంత పెద్ద భవంతులను కూల్చివేయడం ఇక్కడ ఇదే తొలిసారి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇటువంటి భారీ భవంతులను కూల్చివేసిన ఘటనలు అనేకం. ప్రపంచంలోనే ఎత్తయిన భవనాల్లో ఒకటైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Centre) ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Centre)
సెప్టెంబర్ 11, 2001న ప్రపంచ వాణిజ్య కేంద్రం (World Trade Center)కు చెందిన ట్విన్ టవర్స్పై అల్ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో జంట భవనాలు మొత్తం కుప్పకూలిపోయాయి. నాటి మారణహోమంలో 2,753మంది న్యూయార్క్ పౌరులు మరణించగా.. సుమారు 25వేల మందికి పైగా గాయపడ్డారు.
డాయిష్బ్యాంక్ బిల్డింగ్ (Deutsche Bank Building)
అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఈ 39 అంతస్థుల బ్యాంకు భవనాన్ని 2007-2011 మధ్య కాలంలో కూల్చివేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎదురుగా ఉంటుంది. 2001లో ఉగ్రదాదుల దాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన సందర్భంగా ఈ బిల్డింగ్ కూడా దెబ్బతింది. దీంతో ఈ భవంతిని కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ ఘటన జరిగిన దశాబ్దం కాలం తర్వాత పూర్తిచేశారు.
270 పార్క్ లేన్ (270 PARK AVENUE)
న్యూయార్క్ నగరానికి దగ్గర్లోని మాన్హట్టన్ టౌన్లోని పార్క్ లేన్ భవనాన్ని 1961లో నిర్మించారు. అమెరికాలోని ప్రముఖ బ్యాంక్ జేపీ మోర్గాన్ కేంద్రం ఈ భవనంలోనే కొనసాగింది. 215 మీటర్ల ఎత్తయిన ఈ భవంతిని కూల్చివేసి అదేచోట కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2021లో దీని కూల్చివేత పూర్తయ్యింది.
సింగర్ బిల్డింగ్ (Singer Building)
అమెరికాలోని న్యూయార్క్లో సింగర్ బిల్డింగ్ ఉండేది. 1960 దశకంలో న్యూయార్క్ నగరంలోనే అతి ఎత్తయిన భవనం అది. అంతేకాదు, అంతకుముందు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవంతిగానూ (41 ఫోర్లు) రికార్డు నమోదు చేసుకుంది. అయితే, పాత కట్టడం కావడంతో దీనిని 1969లో నేలమట్టం చేశారు.
మారిసన్ హోటల్ (Morrison Hotel)
అమెరికా షికాగోలోని మారిసన్ హోటల్ను 1965లో కూల్చివేశారు. 160 మీటర్ల ఎత్తయిన ఆ భవనం ప్రపంచంలోనే భారీ భవంతుల్లో ఒకటిగా ఉండేది. అంతేకాకుండా ఈ స్థాయి భారీ భవనాన్ని కూల్చివేయడం కూడా ప్రపంచంలో అదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం ఇదే ప్రాంతంలో 259 మీటర్ల ఎత్తులో 60 అంతస్థుల (Chase Tower) భారీ భవనాన్ని నిర్మించారు. 1969లో ఈ నూతన భవన నిర్మాణం పూర్తయ్యింది.
యూఐసీ బిల్డింగ్ (UIC Building)
సింగపూర్లోని యునైటెడ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ బిల్డింగ్ నిర్మాణం 1973లో పూర్తయ్యింది. అప్పట్లో ఆగ్నేయాసిలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటిగా నిలిచింది. 40 అంతస్థుల ఆ భవనాన్ని 2013లో కూల్చివేశారు.
ఆక్సా టవర్ (AXA Tower)
సింగపూర్లో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఆక్సా టవర్ కూడా ఒకటి. దాని ఎత్తు 234.7 మీటర్లు. అయితే, దీన్ని కూల్చివేసేందుకు ఇటీవలే నిర్ణయించారు. దీంతో మే 2022 నుంచి మూసివేశారు. అదే ప్రాంతంలో 305 మీటర్లు (1001 అడగుల) ఎత్తయిన భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సింగపూర్లోనే 171 మీటర్ల ఎత్తయిన సీపీఎఫ్ భవనాన్ని 2017లో నేలమట్టం చేశారు. వీటితోపాటు సింగపూర్లోనే మరో భారీ భవనం ఫ్యుజీ జిరాక్స్ టవర్స్ (165 మీటర్లు)ను 1987లో నిర్మించగా.. ప్రస్తుతం కూల్చివేసే దశలో ఉంది.
మినా ప్లాజా (Mina Plaza)
అబుదాబీలోని అత్యంత ఎత్తయిన భవన సముదాయం మినా ప్లాజా. దీన్ని నాలుగు టవర్లుగా నిర్మించారు. మొత్తం 2,46,000చ.మీ విస్తీర్ణంలో 144 అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనం ఎత్తు 541 అడుగులు. దీన్ని కొన్ని సెకన్ల వ్యవధిలోనే కూల్చివేశారు. షాపింగ్ కేంద్రంగా పేరుపొందిన ఈ ప్రదేశంలో మరో భారీ కట్టడాన్ని నిర్మించే ప్రణాళికలోనే నేలకూల్చారు. ఇలా కారణాలు ఏమైనా ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యాలుగా పేరుగాంచిన వాటిని నేలమట్టం చేసిన ఘటనలు ఉన్నాయి.
నోయిడా ట్విన్ టవర్లు కూలాయిలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!