logo

AP News: కళాశాలలో కొండచిలువలు

జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం రెండు కొండ చిలువలు ప్రత్యక్షమయ్యాయి. సంక్రాంతి సెలవులఅనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు తరగతి గదిని తెరవగా 10, 8 అడుగుల కొండ చిలువలను గుర్తించారు. వెంటనే విద్యార్థులు

Updated : 18 Jan 2022 09:40 IST

విద్యార్థులు హతమార్చిన కొండ చిలువలు

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం రెండు కొండ చిలువలు ప్రత్యక్షమయ్యాయి. సంక్రాంతి సెలవులఅనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు తరగతి గదిని తెరవగా 10, 8 అడుగుల కొండ చిలువలను గుర్తించారు. వెంటనే విద్యార్థులు వీటిని హతమార్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కళాశాలలో ఆరు పాముల వరకు హతమార్చామని అధ్యాపకుడు ప్రసన్నకుమార్‌ తెలిపారు. చుట్టూ పంట పొలాలు, పిచ్చిమొక్కలకు ఆనుకుని భవనాలు ఉండటంతో ఇవి వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని