Pushpa: కేశవుడు మనోడే.. మచ్చా!
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్ ఓ రేంజ్లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు
చిన్నకొడెపాక నుంచి సినిమాల వైపు..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్ ఓ రేంజ్లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్ ప్రతాప్. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు.
పుష్ప సినిమా షూటింగ్లో..
జగదీశ్ ప్రతాప్ తల్లిదండ్రులు బండారి చంద్రమౌళి-లలిత, అక్క ఝాన్సీరచన, చెల్లెలు దివ్య.. నాన్న పోస్ట్మాన్, అమ్మ ఇంటిపనితో పాటు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. 1 నుంచి ఆరో తరగతి వరకు చిన్నకొడెపాకలో, ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్) హనుమకొండలో పూర్తి చేశారు. 2013లో డిగ్రీ పూర్తయింది. నటనపై ఉన్న మమకారంతో చిన్నచిన్న ప్రయత్నాలు మొదలెట్టారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహించేవారు.. ఇంటి వద్ద అమ్మతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం, ఖాళీ దొరికితే హనుమకొండ, వరంగల్కు వచ్చి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేశారు. ‘నిరుద్యోగ నటులు’ అనే వెబ్సిరీస్లో నటించి అందరి మన్ననలు పొందారు. తర్వాత ‘మల్లేశం’ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. తర్వాత పలాస 1978, జార్జిరెడ్డి, ఊరికి ఉత్తరాన సినిమాల్లో అవకాశం దక్కడంతో నటనలో తన మార్కు నిరూపించుకున్నారు.. కొత్తపోరడు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్లో కూడా మెరిశారు. కడప యాసలో మాట్లాడి మెప్పించారు. ఆ యాసతోనే పుష్పలో అవకాశం దక్కింది.
ఇంట్లో ఇష్టం లేకున్నా..
సినిమాలు, నటన అని తిరుగుతుంటే ఇంట్లో వారు ఒప్పుకోలేదు. ఏదైనా సాధించాలనే తపనతో ప్రయత్నాలు చేశారు. తండ్రి చంద్రమౌళి చిందు యక్షగానం, నాటకాలు వేసేవారు. చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని తండ్రి ప్రోత్సహించారు. తండ్రి.. ప్రతాప్ను పోలీసుగా చూడాలని భావించి, కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అయినా సినిమాలవైపే అడుగులు వేశారు.
అవకాశం వచ్చిందిలా..
పుష్ప కోసం మొదటిసారి ఆడిషన్ ఇచ్చి మెప్పించారు. 2019 డిసెంబర్లో రెండో ఆడిషన్లో డైరెక్టర్ సుకుమార్తో ఆరు గంటల పాటు ఆడిషన్ ఇచ్చి ఆయనను ఆకట్టుకున్నారు. కేశవ పాత్ర కోసం చిత్తూరు యాసలో మాట్లాడి అవకాశం దక్కించుకున్నారు. వారం రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో ప్రతాప్ తీవ్రంగా గాయపడగా చేయి విరిగింది. దీంతో ఇంత పెద్ద అవకాశం చేజారుతుందోమోనని భయపడ్డారు. చిత్ర యూనిట్కు సమాచారం ఇచ్చారు. అంతలోనే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలం షూటింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత కొనసాగిన షెడ్యూల్లో పాల్గొన్నారు.
కొత్త జీవితాన్ని ఇచ్చింది.. : బండారి జగదీశ్ ప్రతాప్(కేశవ)
అల్లు అర్జున్తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు మంచి పాత్ర లభించింది. పుష్ప కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలో చేయాలనే ఆలోచన ఉండేది. ఆ దిశగానే ప్రయత్నాలు చేశాను. దర్శకుడు సుకుమార్ నాకు జీవితంపై నమ్మకం కల్పించారు. అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప-2పై దృష్టి పెట్టాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
[ 28-03-2024]
వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. -
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
[ 28-03-2024]
వరంగల్ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య