చిత్రావతి కాలువలో ప్రేమజంట గల్లంతు
మండల పరిధిలోని దాడితోట గ్రామంలోని అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్ద ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైంది. చిత్రావతి నది చూసేందుకు శుక్రవారం వెళ్లిన అమర్నాథ్, రామాంజనమ్మ కాలువలో కొట్టుకుపోయారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ,
చిత్రావతి సమీపంలో చివరిసారిగా స్వీయ చిత్రం తీసుకున్న అమర్నాథ్, రామాంజనమ్మ
దాడితోట(తాడిమర్రి), న్యూస్టుడే: మండల పరిధిలోని దాడితోట గ్రామంలోని అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్ద ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైంది. చిత్రావతి నది చూసేందుకు శుక్రవారం వెళ్లిన అమర్నాథ్, రామాంజనమ్మ కాలువలో కొట్టుకుపోయారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల గ్రామానికి పిచ్చికుంట్ల అమర్నాథ్, అనంతపురం ప్రకాష్నగర్కు చెందిన రామాంజనమ్మ ఇరువురు ప్రేమికులు. అమర్నాథ్ అనంతపురంలో సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అదే మండలానికి చెందిన పరశురాం అనే యువకుడు కూడా అమర్నాథ్ వద్ద పనిచేస్తున్నాడు. పరశురాం సంక్రాంతి పండగకు దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. వారిని కూడా ఆహ్వానించాడు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం భోజనం చేసి తరువాత చిత్రావతి జలాశయం చూసి, అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడంతా కలిసి చరవాణిలో చిత్రాలను తీసుకునే సమయంలో హఠాత్తుగా రామాంజనమ్మ కాలువలోకి జారిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అమర్నాథ్ కుడా కాలువలో పడ్డాడు. పరశురాం వారిని గమనించేలోపు కాలువ మధ్యలో లోతుగా ఉన్న గుంతలోకి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని పరశురాం గ్రామస్థులకు, పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన జంట కోసం గ్రామంలోని ఈతగాళ్లతో వెతికించారు. రాత్రి కావడంతో వెతకడం కష్టంగా మారిందని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. పండగ రోజున ప్రేమికులు గల్లంతుకావడం ఇరువురు కుటుంబాలలో పెను విషాదాన్ని మిగిల్చింది.
కాలువలో గాలిస్తున్న పోలీసులు, గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.