Ts News: పిండి వంట.. ఆరోగ్యమే ఇంట..
సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్ దాడి నుంచి తమను
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ముందుగా కరకరలాడే సకినాలు..అరిసెలు, అప్పాలు, తీయతియ్యని నువ్వుల లడ్డూలు అంటే ఇష్టపడని వారుండరు.. వీటిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలున్నాయి. కరోనా వంటి వైరస్ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎన్నో పోషకాలు ఉండే ఈ పిండివంటలను తినడం ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు.
అరిసెలు.. బియ్యాన్ని ఒకరోజు ముందు రాత్రి కడిగి నానబెట్టి..ఉదయాన్నే పిండిలో బెల్లంపానకం, నువ్వులు వేసి తయారుచేస్తారు. ఇందులో మోనో అన్శాచురేటేడ్ ఫ్యాట్ ఉంటుంది. ఎముకల బలహీనత పోయి దృఢంగా మారుతారు. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మానసిక ఆందోళన దూరమై ప్రశాంతత లభిస్తుంది.
సున్నుండలు.. నెయ్యి, బెల్లం, గోధుమలు, మినుములతో చేసే సున్నుండలు బలాన్నిస్తాయి. మినపప్పులో మంచి పోషకాలుంటాయి. గోధుమల్లో ఫైబర్ ఉంటుంది. సున్నుండలు ఎక్కువ కాలం నిలువ ఉండే అవకాశం ఉంటుంది.
అప్పాలు.. బియ్యం, సెనగపిండి, ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసి చేస్తారు. కరకరలాడే ఈ అప్పాల్లో కలిపే సెనగపిండి ఎంతో శక్తినిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
నువ్వుల లడ్డూలు.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు శరీరానికి పూర్తిస్థాయిలో శక్తినిస్తాయి. బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రోజూ బెల్లం తింటే ఉత్సాహంగా ఉంటారు. రక్తహీనతతో బాధపడేవారికి ఈ లడ్డూలు ఉపయోగకరంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. కాలేయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. జీర్ణసంబంధ వ్యాధులు దరి చేరవు.
సకినాలు.. చలికాలంలో వచ్చే ఈ పండగకు సరిపోయేలా సకినాలు ఉంటాయి. వీటిని తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి సకినాలు చేస్తారు. కొందరు పండగకు వారం రోజుల ముందే చేయడం మొదలుపెడతారు. ఇందులో నువ్వులు, వాము(ఓమ) వేస్తారు. నువ్వుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉన్నాయి. మహిళల్లో హార్మోన్ స్థాయులను సరిగ్గా ఉంచుతాయి. వాము జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
పండగల్లో శాస్త్రీయత ఐశ్వర్య, పోషకాహార నిపుణులు,
ప్రకృతి వైద్యురాలు, నిజామాబాద్
మన సంస్కృతిలో పండగలకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం..సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే అరుదైన ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభం.అంతటా చలిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కరోనా వంటి వైరస్ల ప్రభావం పెరుగుతుంది. దీని నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే..శారీరక సమతుల్యత కోసం వేడిచేసేవి, శక్తినిచ్చేవి, సులభంగా జీర్ణమయ్యే పిండి వంటకాలను తీసుకోవాలి. ఈ పండగకు చేసుకునే అన్ని పిండి వంటలను బియ్యంతోనే చేయడం విశేషం. దీనిలో ఫైబర్, బి విటమిన్ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి