logo

మూడు అపార్ట్‌మెంట్లలో చోరీ

పట్టణంలోని మూడు అపార్ట్‌మెంట్లలో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు చొరబడ్డారు. తాళం వేసిన ప్లాట్లను లక్ష్యంగా చేసుకున్నారు. వర్ష అపార్ట్‌మెంట్‌లోని భాస్కర్‌ ఇంట్లోంచి 6 తులాల బంగారు ఆభరణాలు, సుమారు

Published : 15 Jan 2022 03:16 IST

చోరీకి పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితులు

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మూడు అపార్ట్‌మెంట్లలో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు చొరబడ్డారు. తాళం వేసిన ప్లాట్లను లక్ష్యంగా చేసుకున్నారు. వర్ష అపార్ట్‌మెంట్‌లోని భాస్కర్‌ ఇంట్లోంచి 6 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.3 లక్షల వరకు నగదు అపహరించారు. ప్రీమియర్‌లో రెండు, వైష్ణవిలో రెండు ప్లాట్ల తాళాలు పగులగొట్టారు. వీటిల్లో ఏమీ దొంగిలించలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ ప్లాట్‌లోనూ చోరీకి యత్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని