logo

కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం

 కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రుక్మయ్య తెలిపిన వివరాలు ప్రకారం...

Published : 15 Jan 2022 01:39 IST


సాయిరాం

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రుక్మయ్య తెలిపిన వివరాలు ప్రకారం... స్థానిక మల్లికార్జున్‌నగర్‌ కాలనీకి చెందిన సాయిరాం(24), స్నేహితులు కిరణ్‌శర్మ, రాజు, సతీష్‌  గురువారం అర్ధరాత్రి సమయంలో కారులో చందానగర్‌కు బీరంగూడ వైపు నుంచి బయలుదేరారు. దారిలో లింగంపల్లి కూడలి గండమ్మ గుడి ఎదురుగా కంటైనర్‌ను వేగంగా దాటించబోయి ఢీకొట్టారు. దీంతో కారు పల్టీలు కొట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న సాయిరాం అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మిగిలిన ముగ్గురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.  

నుజ్జయిన కారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని