గనులు తెరమరుగు..
సింగరేణి పుట్టినిళ్లైన బొగ్గుట్ట(ఇల్లెందు) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన బొగ్గుట్టలో గనులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న భూగర్భ గనులు నేడు
జేకే-5 ఉపరితల గని
ఇల్లెందు, న్యూస్టుడే: సింగరేణి పుట్టినిళ్లైన బొగ్గుట్ట(ఇల్లెందు) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన బొగ్గుట్టలో గనులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న భూగర్భ గనులు నేడు పూర్తిగా కనుమరుగయ్యాయి. కేవలం ఏరియాలోని జేకే-5, కోయగూడెం ఉపరితల గనుల ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమ ఏదైనా ఉంటే ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రంగాల మందికి ఉపాధి లభిస్తుంది. ఎన్నో వ్యాపారాలు కొనసాగుతాయి. కానీ పరిశ్రమలు అంతరించిపోతే పలు రంగాలపై ఆధారపడిన ఎంతో మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది.
ఎదురుచూపులు..: బొగ్గుట్టకు పూర్వవైభవం రావాలంటే సింగరేణి నూతన గనుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. భూగర్భ, ఉపరితల గనులు ఏర్పడితేనే బొగ్గుట్ట మళ్లీ కళకళలాడుతుంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ జేకే-5 గని విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుంది. సుమారు 12 ఏళ్ల జీవితకాలం ఉండే విధంగా గనిని ఏర్పాటు చేయాలని చర్యలు చేపడుతున్నారు. అందుకోసం జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో అధికారులు నిత్యం కృషి చేస్తున్నారు. ఈ గని ద్వారా సంవత్సరానికి 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. మొత్తం 128 మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
మూతపడనున్న ఉపరితల గని
ఇల్లెందు ఏరియాలో రెండు ఉపరితల గనులు, ఒక భూగర్భ గని ఉండేది. అయితే 21 ఇంక్లైన్ భూగర్భ గని కారణంగా సంస్థ నష్టాలపాలవుతుందనీ దాన్ని ఇటీవల పూర్తి స్థాయిలో మూసేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న జేకే 5 ఉపరితల గని జీవితకాలం మరో 8 నెలలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, ఓబీ పనులను సింగరేణి సంస్థ చేపడుతుంది. ఒక వేళ ఓబీ పనులు ప్రైవేటు సంస్థ చేపడితే దాని జీవిత కాలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ గనిలో ప్రస్తుతం అధికారులు, కార్మికులు కలిపి మొత్తం 280 మంది పని చేస్తున్నారు. ఈ గని కారణంగా కార్మికులతోపాటు ఒప్పంద కార్మికులైన సివిల్, వాటర్ సప్లై, లోడింగ్, ఆన్లోడింగ్, లారీల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర వ్యాపార రంగాలు, హోటళ్లు సుమారు 4 వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ గని మూతపడితే వీరందరూ తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం