దరఖాస్తుల వెల్లువ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే
ఎస్సీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 4267 మంది నమోదు
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే
విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న సత్యనారాయణ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి గతేడాది కన్నా మూడింతలు దరఖాస్తులు నమోదు చేయించారు. ఈ విద్యా సంవత్సరంలో 4267 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయడంతో రాష్ట్రంలో జిల్లా ముందు స్థానంలో నిలిచింది. అందులో ఇప్పటివరకు 1738 మందికి నిధులు విడుదల చేయగా ఇంకా 2529 మందికి రావాల్సి ఉంది.
జిల్లాకు ప్రథమ స్థానం
ఎస్సీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు అందించేందుకు జిల్లా పాలనాధికారి గౌతమ్ ప్రత్యేక దృష్టిసారించారు. పలుమార్లు అధికారులతో సమీక్షించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, విద్యాశాఖ, మీసేవ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో వీరంతా జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో వసతిగృహ సంక్షేమాధికారులు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి వారిని చైతన్యవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. దీనికితోడు ఎస్సీడీడీ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం జూమ్ సమావేశం ద్వారా పురోగతిని సమీక్షించడం వంటి పనులు చేశారు. ఒక దశలో ప్రక్రియ వేగవంతం చేసేందుకు అలసత్వం వహించే సంక్షేమాధికారులకు శ్రీముఖాలు కూడా జారీ చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు కృషి చేసి జిల్లాను ముందువరుసలో నిలిపారు.
* రాజీవ్ విద్యాదీవెన(ఆర్వీడీ): 9,10 తరగతులు చదివే విద్యార్థులకు అందించే ఉపకార వేతనం. ఒక్కొక్కరికి రూ.3000 ఇస్తారు.
* న్యూస్కీమ్: 5 నుంచి 8వ తరగతిలో అందించే ఉపకార వేతనం. ఒక్కో బాలురకు రూ.1000, బాలికలకు రూ.1500 అందిస్తారు.
ఏటా దరఖాస్తు సంఖ్య ఆశించినంత సంఖ్యలో రాకపోవడంతో ఈసారి ప్రత్యేక దృష్టిసారించాం. జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూలేనంతగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- కస్తాల సత్యనారాయణ, ఎస్సీడీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?