అసలుకు ఆరింతలు వసూళ్లు
గోరంత ఖర్చు చేసి కొండంత లాగేస్తున్నారు. దస్త్రాల ముసుగులో మద్యం లైసెన్సీల నుంచి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఆబ్కారీ శాఖలో ఆనవాయితీగా మారిన అడ్డగోలు వ్యవహారం తరచి చూస్తే ఔరా అన్పించకమానదు. ఆ శాఖలోని ఉద్యోగ సంఘం
ఆబ్కారీ కార్యాలయంలోనే దస్త్రాల అడ్డగోలు విక్రయాలు
ఖమ్మం సారథినగర్, న్యూస్టుడే
గోరంత ఖర్చు చేసి కొండంత లాగేస్తున్నారు. దస్త్రాల ముసుగులో మద్యం లైసెన్సీల నుంచి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఆబ్కారీ శాఖలో ఆనవాయితీగా మారిన అడ్డగోలు వ్యవహారం తరచి చూస్తే ఔరా అన్పించకమానదు. ఆ శాఖలోని ఉద్యోగ సంఘం ముద్రించిన దస్త్రాలను(రిజిష్టర్లను) ఆబ్కారీ సూపరింటెండెంట్ల(ఈఎస్) కార్యాలయాల్లోనే విక్రయిస్తుండటం గమనార్హం.
చెప్పిన ధరకే కొనుగోలు
మద్యం దుకాణాల నిర్వహణకు దస్త్రాలు అవసరం. ఒక్కో దస్త్రం ఖరీదు బయట మార్కెట్లో రూ.400 వరకు ఉంటుంది. ఇదే దస్త్రాన్ని మద్యం లైసెన్సీ దుకాణదారుడు రూ.2,400కు అది కూడా ఎక్సైజ్ జిల్లా కార్యాలయం నుంచే కొనుగోలు చేస్తున్నారు. కచ్చితంగా ఇక్కడే కొనుగోలు చేయాలా? అంటే అలాంటి ఆంక్షలు లేవు. అయినా స్వకార్యం, స్వామి కార్యం ఇందులోనే ఉండటంతో దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఒక్క లైసెన్సీ కిక్కురుమనడం లేదు. చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నారు.
రూ.లక్షల్లో దందా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 220 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణానికి తక్షణమే రెండు దస్త్రాలు అవసరం. ఈ లెక్కన ఒక్కో దుకాణదారుడు రెండు దస్త్రాలకు రూ.4800 ముట్టజెప్పాల్సి వస్తోంది. మిగిలిన రూ.200 తిరిగి ఏం ఇవ్వాలని రౌండ్ ఫిగర్ చేసుకుని రూ.5 వేలు వసూలు చేస్తున్నారనే వాదనలున్నాయి. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 220 దుకాణాల్లో ఒక్కో దుకాణం అటు ఇటుగా అదనంగా చెల్లించిన రూ.4 వేలను లెక్కిస్తే రూ.8.8 లక్షలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయం ఎక్కడా ఆబ్కారీ అధికార శాఖ లెక్కల్లో ఉండదు. లాభం మాత్రం కొందరు ఉద్యోగుల చేతుల్లో పడుతోంది. ఇలా ఒక్కో దుకాణం తమ రెండేళ్ల కాలంలో రెండు నుంచి ఆరు దస్త్రాలను కొనుగోలు చేస్తుంది. ఈలెక్కన దస్త్రాలు విక్రయ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ దుకాణంలో రెండు దస్త్రాలు అవసరమవుతాయి. వాటి ధర రూ.1200 వరకు ఉంటుంది. శాఖతో సంబంధం లేకుండా వాటిని విక్రయిస్తారు. ధ్రువీకరణ సంతకం కోసం మాత్రమే దస్త్రాలు నా దగ్గరకు వస్తాయి. అధిక వసూళ్లు అనేది అవాస్తవం. విక్రయాల విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- సోమిరెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..