'భావితరాలకు ఆదర్శంగా నిలవాలి`
న్యాయవాదులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని
జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి చంద్రశేఖరప్రసాద్
ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్టుడే: న్యాయవాదులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో న్యాయమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించి న్యాయవాదులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం సక్రమ మార్గంలో నడవాలంటే న్యాయవాదులు చేసే కార్యక్రమాలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. న్యాయమూర్తులు డానీరూత్, శ్యాంశ్రీ, అక్తర్, శ్రీనివాస్, జావీద్పాషా, అనితారెడ్డి, శాంతిసోనీ, మౌనిక, పూజిత, భారతి, బార్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.గురుమూర్తి, కార్యదర్శి కోనా చంద్రశేఖర్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా పరిషత్తులో..
కలెక్టరేట్లో జెండా వందనం చేస్తున్న టీఎన్జీవో ఉద్యోగులు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఛైర్మన్ కమల్రాజు పాల్గొనగా జడ్పీ సీఈవో అప్పారావు జాతీయ జెండా ఎగుర వేశారు. గాంధీ విగ్రహానికి జడ్పీ ఛైర్మన్, సీఈవో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉప సీఈవో చంద్రశేఖర్, తల్లాడ జడ్పీటీసీ ప్రమీల, ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను జడ్పీ ఛైర్మన్ ఆవిష్కరించి, వందనం చేశారు. కలెక్టరేట్లో టీఎన్జీవో నాయకులు జాతీయ పతాకాన్ని ఎగరేశారు.
పరిమిత సంఖ్యలో..
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్ గౌతమ్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే: కొవిడ్ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో ఆహుతుల మధ్య భారత 73వ గణతంత్ర దినోత్సవం కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ వీపీ గౌతమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. అంతకు ముందు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాహుల్, డీఆర్వో శిరీష, ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ, సీపీవో శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాము, ఆర్డీవో రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు