logo

గుట్కా పొట్లాల స్వాధీనం

పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కిరాణా దుకాణాల్లో నిల్వ చేసిన నిషేధిత గుట్కా, జర్దా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్వహించిన....

Published : 22 Jan 2022 02:36 IST


వివరాలు వెల్లడిస్తున్న సీఐ జలంధర్‌రెడ్డి

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కిరాణా దుకాణాల్లో నిల్వ చేసిన నిషేధిత గుట్కా, జర్దా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి వెల్లడించారు. బషీరాబాద్‌ మండల కేంద్రంతోపాటు సరిహద్దున ఉన్న మైల్వార్‌లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మైలాపురం సుధాకర్‌, చిదిరి గోపాల్‌ దుకాణాల్లో సుమారు రూ.2లక్షల విలువైన గుట్కా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేశారు. నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. ఏఎస్‌ఐ నర్సింహులుగౌడ్‌, పోలీసు సిబ్బంది వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని